Search blog.co.uk

Archives for: September 2007

దయ్యాల భూమిలో దేవతలు!!-Kavitha-17

by ramrali @ 2007-09-29 - 06:08:03

దయ్యాల భూమిలో దేవతలు!!

దయ్యాల భూమిలో దేవతలడుగెట్టాయి!
దైవం పేరిట దయ్యాల మనసులు మార్చాలని
ధర్మ రక్షణ చేయాలనుకున్న దేవతలు
దయ్యాలకు సూక్తులెన్నో చెప్పాయి!!
తమ భూమిపై అడుగిడిన దేవతల పై
దయ్యాలెంతో కోపించాయి!
దేవతలు చెప్పే హితాలు అహితాలు కాగా
దయ్యాలన్నీ దేవతల నిహతుల చేస్తున్నాయి!
అయినా కానీ,దేవతలెంతో ఓర్పుతో
హితోక్తుల పలుకుట మాన కుండె!!
పరిస్థితులనర్థం చేసుకున్న దయ్యాలు
మార్పు - చేర్పులతో కొత్త పుంతలు తొక్కాయి!
ఆ పై;దేవతల ముసుగేసుకున్న దయ్యాలు
మర్జాల సూక్తుల వల్లిస్తూ
మందిని మ్రింగుట మొదలిడి
మేదినిలా పెరిగాయి!!
దయ్యాలను గుర్తించలేక దేవతలు
కట కట లాడి-కళ వెళ పడ్డాయి?!
గో ముఖ వ్యాఘ్రాలనూ,పయోముఖ విష కుంభాలనూ
మేకవన్నె పులులనూ-వేదాఆలను వల్లించే దయ్యాలనూ
ఏ నాటికీ గుర్తించలేక దేవతలు
దయ్యాల పాల బడి వెతలు చెంది విసిగిన దేవతలు
దయ్యాలను వాటి కర్మకు వాటి నొదిలి
తమ స్వర్గానికి పలాయన మై పోయాయి!
స్వేఛ్ఛా వాయువుల పీల్చి , ఇప్పుడా
దయ్యాలు తమలో తాము కాట్లాడు కుంటూ
ఒకర్నొకరు దోచుకుంటూ,
చంపుకుంటూ-నరుక్కుంటూ
తమ భూమిని దయ్యాల స్వర్గ మనుకుంటున్నాయి!!


 
 

తాగుబోతు-తిరుగు బోతు!!

by ramrali @ 2007-09-28 - 11:34:25

తాగుబోతు-తిరుగు బోతు!!
Every action will be having a reaction is the phenomenon of Hindu God(s)రాముడున్నాడా?రామాయణం నిజానికి జరిగిన వాస్తవ కథేనా? హిందూ దేశంలో పుట్టి ఇన్నేళ్లు గతించాక వీటి పైన ఆలోచన చేసి కొట్లాడుకోవటం క్షేమం కాదు. హైందవం జవసత్వాలు గల మతం. దానికి ఆ జవ సత్వాలు రావటానికి కారణం వారి పూర్వీకులూ,వారు దేవునిమీద రాసి వుంచిన పురాణ గాధలూ,వేదాలూ -వాటి ఉపాఖ్యానాలు. హిందూ దేవుళ్ల కందరికీ జీవితం నిర్యాణం (అవతార సమాప్తి)చరిత్రలున్నాయి. ఇంకా వారందరూ ఆదర్శమైన జీవితాన్ని గడిపినట్లు ఉంది.
తాగు బోతు-తిరుగు బోతు!
రాము డున్నాడా? రామాయణం జరిగిందా లేదా? అని హేతు వాదులు ఆలోచించి,రాముడు ఒక అభూత కల్పనగా కొట్టి పారేశారు. ఇందులో సంతోషించ దగ్గ విషయ మేమంటే అలా అన్న వారు,రాముడు లేడు అభూత కల్పన అన్నారు గానీ,వాల్మీకి లేడు అన నందుకు సంతోషిద్దాం! అందులో వారు వాడిన పదజాలం "రాముడు తాగుబోతు", అని.తాగుబో తులంటే ఎవరు? అసలు తాగని వారు వుంటారా? అని అంటే-వచ్చే సమాధానం-అందరూ తాగుబోతు లేనని.ఈ తాగుడులో చాలా వెరైటీస్ వున్నాయి. సోమ పానము-సోమ లతనించి తీస్తారట? ఇది పూర్వకాలం వాడే వారట. అది ఇప్పుడు మనకి తెలీదు.దీన్ని సురలూ-భూసురులూ, అందరూ సేవించే వారుట.రెండు -కల్లు,3.పులవ బెట్టిన కల్లు,ఇందులో ఈత,జీలుగు,ఇలా అన్ని వృక్ష జాతులవీ వున్నాయి. దేనికి దానికి సెపరేట్ గుణా లుంటాయి. పూర్వం ఎవరింట్లో వాళ్లే స్వంతంగా ఇవన్నీ తయారు చేసుకుని సేవించే వారు.

రాము డున్నాడా? రామాయణం నిజానికి వాస్తవంగా జరిగిన కథేనా? దేవదాసు నిజంగా వున్నాడా?(క్షమించాలి.కరుణానిధిగారు రాముని తాగుబోతు అన్నందువల్ల వెంటనే దేవదాసు గుర్తొచ్చి కంపేర్ చేస్తున్నా గాని, ఇద్దరికీ సంబంధం ఏమిటి? ఒకడు దేవుడు మరోడు దేవునికి దాసుడు.)రాముడు వాల్మీకి బుర్రలో పుడితే, దేవదాసు శరత్ బుర్రలో పుట్టాడు. రాముడు పుట్టక ముందే రామాయణం రాయటం వల్లా,(నారద మంత్రోప దేశం వల్ల-"మరా") అప్పటికి రామాయణం జరిగి వుండలేదు అనేది నిర్వి వాదాంశం.అయితే ఆ తరవాత రాముడు పుట్టాడు. అందువల్ల ఉత్తర రామాయణం వాల్మీకికి రాయటం సుసాధ్యమైంది అంటారు. రాముని దేవుడు కాదనుకున్నా ఈ సంసార సముద్రాన్ని తరణం చేసే టందుకు "రామ",అన్న శబ్దం తారక మంత్రంబై కూచుంది. తరింప చేసేది తారక మంత్రం! రామాయణం లోని సుందరకాండ పారాయణం చేసి కుష్ఠు వ్యాధిని తొలగించు కున్న వారూ ,కష్టాలనించి గట్టెక్కిన వారూ కో కొల్లలుగా జనాలు వున్నారు.కబీరు,పోతన,రామదాసు,తుకారాం -ఇలా చరిత్రలో ఎందరో మనకు కని పిస్తారు. ఒక వేళ వీరు తరించ లేదు అని అనుకున్నా కనీసం రామ నామ స్మరణలో మనశ్శాంతిని పొందారు. భగ్న ప్రేమికులు దేవదాసు సినిమా చూసి ప్రేమలో విఫలమై, తాము తాగుబోతులుగా మారాలి కామోసు అనుకుని తాగుబో తులైన జనులు కోకొల్లలుగా వున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచు కోవాలి.ఏసు క్రీస్తు అప్పటికి పుట్ట లేదు. క్రీస్తు పుడతాడనీ,అప్పుడు నక్షత్రం మెరుపు గొడవా ఎన్నో ఉన్నాయి. దాని ఆధారంగా కష్టాలు అను భవిస్తున్న వారు దేవుని కుమారుని రాక కోసం ప్రయాణం చేసి వెళ్లినట్లు బైబిల్ చెబు తుంది.ఇప్పుడు క్రీస్తు ఖచ్ఛితంగా పుట్టాడని తెలుసు.ఆయన పేరిట క్రీస్తు శకం మొదలైంది. చరిత్ర గతించిన కొద్దీ మరుగున పడి పోతుంది. అదే జరిగింది.ఉ|| శాతవాహన శకం,కల్క్యాబ్ది శకం, ఇలా ప్రతి పెద్ద పేరిట ఎన్నో శకాలున్నాయి. వాటిని బట్టి అవి జరిగాయని తెలుసు కుంటాం.దేవదాసు అనేవాడు నిజానికి పుట్ట లేదు. కాని ఆ దేవదాసు సినిమా తీసి,నాటకాలు వేసీ నటులు దానికి ప్రాచుర్యం కల్పించి దేవదాసుని చిరస్మరణీయుని చేసి పారేశారు.రచయితలూ-కవులూ ఏది వ్రాసినా దానికి ఒక ప్రయోజనాన్ని ఆశిస్తారు. రామాయణం రాయటానికి సమాజంలో నాడు వున్న బహు భార్యాత్వాన్నీ,MIGHT IS RIGHT అనే వ్యవస్థని తొలగించి , సర్వ జనాళీ (ముఖ్యంగా స్త్రీలు ) సుఖ సంతోషాలతో బతికేటందుకు రాయటం జరిగితే-;దేవదాసు పాత్ర మనసులోని ప్రేమను బట్టి నడుచుకోవాలే గాని పెద్దలు చేసిన పెళ్లిళ్ల వల్ల ఎటువంటి నష్టం కలుగు తుందో చూపాడు. నాటి వ్యవస్థలో మనస్సుకన్నా ఆచార వ్యవహారాలూ-కుల మతాలకు ఎక్కువ ప్రాముఖ్యత వుంది.మార్పు కోసం రాసినది.దీని వల్ల కొందరు తమకు నచ్చిన స్త్రీని వివాహ మాడి జీవితంలో సుఖం పొందారు.ఆ విధంగా శరత్ కృత కృత్యుడ య్యాడు.అయితే,తాను ప్రేమించిన స్త్రీ వివాహ బంధం వల్ల పరాయి వాని (సొత్తు?) భార్య అయితే,

ఒక్కోసారి నా లాటి వాడి అవసరమూ ఉంటుంది!!kavita-16

by ramrali @ 2007-09-27 - 14:31:57

ఒక్కోసారి నా లాటి వాడి అవసరమూ ఉంటుంది!!
నన్ను అక్కడ కూలేశారు
క్రికెట్ మ్యాచ్ బ్రహ్మాండంగా సాగుతోంది
ఈల్ల జోరందుకుంది! ఆట రసవత్తర ఘట్టాలు
తాడో పేడో తేలే పరిస్థితి
ఈల లేశాను - నెగ్గాలి ఇండియా అని అరిచాను
నా ఉద్వేగం ఆగ లేదు -
హమ్మయ్య! నెగ్గేశాను!! మన ప్రత్యర్థినోడించేశాను!!!
కళ్లవెంట ధారా పాతంగా నీళ్ళు కారాయి
ఆనంద భాష్పాలవి!
యుద్ధం జరుగుతోంది!
War - War!! హిందూ సోల్జర్లు
శత్రుసైన్యాల్ని మట్టు పెట్టేస్తున్నారు
అదిగో భారత దేశ విజయ పతాకం ఎగిరింది!
జై! భారత్!! అరిచాను గట్టిగా!!
క్రీడా కారుడిగా పరుగు పందెంలో
ఎదరకు దూసుకుపోతున్నాను లక్ష్యం వైపు
మరొక్క సెకను మరొక్క సెకను
వేగం పెంచితే చాలు - నాకే మొదటి బహుమతి!!
హమ్మయ్య! నెగ్గేశాను!!
మనసు ఆహ్లాదంతో కేరింతలు కొట్టింది!
లాంగ్ జంప్,హై జంప్ - ఇలా అన్నిట్లోనూ
నేనే..ఫస్ట్! నేనే ఫస్ట్!!
గాట్టిగా అరిచి - ఆ పై భోరునేడ్చేస్తున్నాను
అమ్మ పరిగెత్తుకొచ్చింది!
"ఏరా కన్నా!! ఏమైందిరా?”, అంది.
అమ్మా అన్నింట్లోనూ మన దేశం ముందుందమ్మా!
"అన్నిట్లోనూ నేనే ఫస్టు!",అని భోరునేడుస్తూ
నా చేతుల్లో ముఖాన్ని దాచుకున్నాను
అమ్మ హృదయం బాధతో విల విలాడింది!
ఆమె నన్ను గుండెలకు అదిమి పట్టుకుంది!?
"కన్నా!కన్నా!! ఏడవకమ్మా!!",అంటూ!?
నాలో ఆవేశం పెరిగింది!"అమ్మా నేను వ్యర్థ జీవిని!
నేను నా దేశానికి ఏ విధంగానూ ఉపయోగ పడను!
కదమ్మా! నేను చచ్చిపోతానమ్మా! నన్ను చంపెయ్యమ్మా!-
అసలు నన్నెందుకు కన్నా వమ్మా?",అని అరిచాను!
"లేదు కన్నా! నీ అవసరం నాకుంది!
నాకే కాదు కన్నా -ఈ దేశానికి వుంది
ఆ రోజు వస్తుంది! తప్పకుండా వస్తుంది!!
నువ్వు ముందు శ్రద్ధగా చదువుకో!
నీకు నేను అండగా వుంటాన్రా!", అని
ఆ రోజు అమ్మ నన్ను ఓదార్చింది!
మృత్యుముఖంలోకి పోకుండా ఆపింది!!
ఆమె అందించిన ధైర్యం-స్ఫూర్తి
నన్నిప్పుడింత వాణ్ణి చేసింది
నాడు కంప్యూటరు ఎదర కూచుని
అన్ని ఆటలూ పుట్టుకతో వికలాంగుడి నైన
నేనే ..ఆడుకుంటున్నట్టు భావించి ఆనందించాను
నా దేశానికి నేనే ఎనలేని కీర్తి తెచ్చినట్లు భావించాను
ఇప్పుడది నిజమైంది!
నేను భారత దేశ సైనిక దళంలో
ఉద్యోగి నయ్యాను! రిమోట్ కంట్రోల్ తో
శతృ స్థావరాలను ఛేదించగల
క్షిపణులను అవసరాన్ని బట్టి
ప్రయోగించేటందుకు సిద్ధంగా
యుద్ధ భూమిలో నాస్థానంలో నేను
కూచుని-శతృవుల నోడించి భారత దేశ
మువ్వన్నెల విజయ బావుటా నెగరేశాను!!
నా తోటి సైనికులు నన్నెత్తుకుని ..
భారత దేశాద్యక్షుని దగ్గరకు
మోసుకెళ్లారు-నాకు ఆయన గౌరవ పురస్సరంగా
ఇచ్చే బహుమతినిస్వీకరించటానికి!!
నా కనులు చెమ్మగిల్లాయి!!
నా ఈ విజయానికి కారకురాలైన ..
నా అమ్మ ఇప్పుడు లేదు!
నన్ను ఆత్మ హత్య చేసుకోకుండా
కాపాడిన ఆ అమ్మ మరో లోకంలో వుంది!!
నన్ను అక్కడుండి ఆశీర్వదిస్తోందని భావిస్తున్నాను!?

వరం ప్రసాదించు భగవాన్!!-Kavita-15

by ramrali @ 2007-09-27 - 14:27:10

వరం ప్రసాదించు భగవాన్!!

దేవుడా! నేనిప్పుడు తెలుసుకున్నాను..
నేను రాక్షసులమధ్యనీ.. దుర్మార్గుల మధ్యనీ..
బతుకుతున్నానని!
అందుకే నేనిప్పుడీ వరాలని కోరుకుంటున్నాను?!
నేను విషానికి విషం గామారాలి!
నన్ను కాటేసిన పాము నావిషంతో మరణించాలి!
నన్ను కుట్టిన దోమలు..చీమలు...
తేళ్లు.. నా రక్తంపీల్చిన నల్లులు
సమస్త జీవజాలాలూ..
నన్ను మింగడానికి రాబోయే..
సింహాలూ..పులులూ ...
నా పై లంఘించబోతే కడుపునొప్పితో
అక్కడికక్కడే గిల గిల కొట్టుకు చావాలి
నాకు ఏ మనిషైనా చెడు తలబెడితే
వాడికే ఆ చెడు జరగాలి-
నా కేసి కన్నెత్తి చూస్తే ..
నన్నన్యాయం చేయాలనుకుంటే..
అక్కడికక్కడే పడి కొట్టుకు ఛావాలి
అలాగైతెనే ఈ లోకంలో నా జోలికెవరూ రారు!
లేకుంటే నా మంచితనాన్ని నా చాతకాని తనమనుకుంటున్నారీ ప్రజ!!

అవినీతి అగ్ని లో సమిథలు! Fly Over Bridge Ruins? kavita-14.

by ramrali @ 2007-09-27 - 14:23:19

శ్రీశ్రీ గారికి క్షమాపణలతో ఈ పేరడీ!:- ఫ్లై ఓవర్ బ్రిడ్జి కూలిన సందర్భంగా:-
అవినీతి అగ్ని లో సమిథలు!
నేను సైతం నేను సైతం
ప్రపంచ అవినీతి అగ్నిలో
ఒక నిప్పు కణిక నయ్యాను.
నేను సైతం నేను సైతం
ఫ్లై ఓవర్ బ్రిడ్జిలోని
సిమెంటులో కలిసిన ఒక
ఇసుక రేణువయ్యాను
నేను సైతం నేను సైతం
ఫ్లై ఓవర్ బ్రిడ్జిలోని
ఇనుప స్థంభ మయ్యాను
నేను సైతం నేను సైతం
కాంట్రాక్టరు జేబు నింపాను
నేను సైతం నేను సైతం
ఉద్యోగుల నోళ్లు తడిపాను
నేను సైతం నేను సైతం
నేతల బొజ్జలు పెంచాను
నేను సైతం నేను సైతం
అవినీతిని అందల మెక్కించాను
నేను సైతం నేను సైతం
నిండు ప్రాణుల ఉసురు తీశాను
నేను సైతం నేను సైతం
ప్రపంచ అవినీతి అగ్నిలో
ఒక నిప్పు కణిక నయ్యాను.
నేను సైతం నేను సైతం
కలియుగ ధర్మానికి
ఆదర్శ అవినీతి మార్గాన్ని చూపాను
నేను సైతం నేను సైతం
స్వార్థమే పరమార్థ మన్నాను!!
స్వార్థమే పరమార్థ మన్నాను!!

దశావతారాలు ఏక కంద పద్యంలో..

by ramrali @ 2007-09-23 - 07:40:57


దశావతారాలు ఏక కంద పద్యంలో..
1.మీనము 2. కూర్మ 3. వరాహ
మ్మైన దనుక 4.నారసింహమై,5.వామనుడై
తానే మువ్వురు (6,7,8)రాములు
గా నిల వెలసె 9.హరి కలిని 10.కల్కిగ బుట్టన్!
(గా నిల వెలసెను మురారి కల్కిగ పుట్టన్!!)
(గా నిల బుట్టిన మురారి కల్కిగ వచ్చున్!!)
1.mInamu 2. kUrma 3. varaaha
mmaina danuka 4.naarasiMhamai,5.vAmanuDai
tAnE muvvuru (6,7,8)rAmulu
gaa nila velase 9.hari kalini 10.kalkiga buTTan!
(gA nila velasenu murAri kalkiga puTTan!!)
(gA nila buTTina murAri kalkiga vaccun!!)
1.Fish,2.Tortoise (Turtle),3.Wild Boar(Wild Pig)4.A man&lion,(narasimham),5.Short man bachelor,(Vamana),6.Parasurama,7.Raghu Rama,(Son of Dasaratha),8.Bala Rama (Son of Nanda),9.Lord Krishna ,10.Kalki.

నాడు - నేడు . . .నాగరికత?! Kavitha-13

by ramrali @ 2007-09-19 - 13:46:53

నాడు - నేడు . . .నాగరికత?!
ఒకనాడు భారతీయ ఋషులు కొందరు దిగంబరంగా తిరిగేవారు
గోచీల తో తిరిగేవారు .. స్నానం చెయ్యగానే . . .
గజస్నానంలా ఒంటికి బూడిద పూసుకునేవారు
మరికొందరు శరీరానికి బురద పట్టించి అలాగే ఎండలో ఆరేలా చేసుకునేవారు
ఉఛ్వాస నిశ్వాసల నియంత్రించేవారు ...
శూన్యంలోకీ ఆకాశంలోకీ చూస్తూ
కనిపించని దైవాన్ని ప్రత్యక్షం చేసుకునేటందుకు ఆరాథించేవారు!
లోకంతో సంబంధం లేకుండా ఈ లోకంలో బతికేవారు
వారిదంతా పార లౌకిక చింత!అందరూ సుభిక్షంగా ఉండాలనే తపన!!
పరిసరాలతో సంబంధం లేకుండా ఉండటం!!
ఎండ కెండి-వాన తడిసి - చలికీ -వేడిమికీ తట్టుకునేలా
శరీరాన్నలవాటు చేసుకునే ప్రక్రియ అది!
అనారోగ్యమెరుగరు-ఆరోగ్యం వారి స్వంతం!
పాశ్చాత్యులు భారతదేశానికొచ్చి . .
పాపం అనాగరికులు!! తిండికీ బట్టకీ కరువు అందుకే అలా ఉన్నారు
అనుకున్నారు! అదే విషయం అందరికీ చెప్పి ప్రచారం చేశారు
తాము భారతీయులకి నాగరికత నేర్పామని డాంభికాలు పోయారు!?
నిజంగా పాశ్చాత్యులు ఏమి నేర్పారు??ఆలోచించాల్సిందే!!
భారత దేశపు మగ వారు ఎలాగున్నా ..
స్త్రీల విషయానికొస్తే . . ఏడు గజాల-ఎనిమిది గజాల చీరలో
అందంగా . . హుందాగా . . . ఉండేవారు!
కొందరికి రైకలు లేకున్నా నిండుగా చీర కట్టుకుని
శరీరాన్ని చక్కగా కప్పుకునేవారు . . నాభి కూడా కనిపించకుండా!!
ఒకటి రెండు బట్టలతో ఉన్న దాంతోనే సంతృప్తిగా బతికారు!
లౌకిక వాంఛలకన్నా మరణం తరవాత జీవితం గూర్చి ఆలోచించేవారు
అందుకే ఎవరికీ అపకారం . . చీమ క్కూడా తలపెట్టేవారు కాదు!!
ఇప్పుడు నాగరికత పెరిగిన పాశ్చాత్యులకి
బట్ట అవసరం కనిపించటల్లా!? స్ట్రీకింగ్ . . నూడ్ బ్యూటీ పాషన్ షో లొచ్చాయి!!                Famous 7  Bikini 2 
చదవకముందు కాకర కాయ అంటే . . చదువుకుని కీకరకాయ అన్నాట్ట!!
అలాటిదే ఇది! కరువు వల్ల తిండికి నోచుకోక పోయి
ఉపోషాలతో పస్తులుండటంలో తప్పు లేదు!
తిండికి ఉండీ-జీర్ణం చేసుకునే శక్తి ఉండీ ..
అందం కోసం ప్రాకు లాడుతూ . .
సన్న బడాలని డయటింగ్ చేసే భామల కన్నా దౌర్భాగ్యం మరోటి లేదు
వంటి నిండా కప్పుకుందుకు బట్టా- డబ్బూ ఉండీ
దరిద్రుల్లా రోడ్డువార పోయే బిచ్చగత్తెలా
సముద్రపొడ్డున సూర్య స్నానం అంటూ
నగ్నంగా పడుకునే పాశ్చాత్య భామలు
అందాల పోటీ అంటూ అర్థ నగ్నంగానూ . .
కొండొకచో నగ్నంగానూ వేదికలెక్కి నడిచే భామలు
డిస్కో-కాబరే నృత్యాలంటూ ఒక్కొక్క బట్టే వొలిచి
తమ శరీర సౌందర్య లావణ్యాలని చూపాలని
తపించే పాశ్చాత్య నాగరికతలు . . నేడు పెరుగుతున్నాయి!!
సముద్రం వొడ్డున గోచీ పెట్టుకుని-
గుండెలకి పలుచని నైలాన్ వస్త్రాన్ని అడ్డం పెట్టుకుని
శరీరం చూపటమే లక్ష్యంగా నర్తించే భామలు
నేటి పాశ్చాత్య అనుకరణ చేసే భామలు . . వీరిది ఏమి దౌర్భాగ్యం?
అవును వారే నిజంగా.. నిఝంగా భారతీయులకి
నాగరికత నేర్పారు!!బట్టలెలాకట్టుకోవాలో
సంస్కారమంటే ఏమిటో . . డబ్బుతో లోకాన్ని ఎలా కొనాలో
డబ్బుకే ప్రాథాన్యతనిచ్చే సంస్కారాన్నీ నాగరికతనీ
భారతీయులకి నేర్పారు!!ఆవేశ-కావేషాలూ ..
నిత్య సుఖాల్లో ఓలలాడ టం నేర్పారట
వారు రాక పూర్వమే అదీ ఒక పద్ధతి ఉంది!
భంగూ-గంజాయీ - సురా పానం చేసే ఒక జాతి
ఆ జాతి ప్రజలకు దూరంలో ఉండేది భారత దేశంలో!!

ఇదంతే అక్షరం!సంగీత-నృత్య రూపకం :-

by ramrali @ 2007-09-08 - 13:53:55